తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సాయి పల్లవి క్రేజీ హీరోయన్గా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం ఆమె వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతుంది.
ఫిదా చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఎంసీఎ చిత్రంతో ఆకట్టుకుంది.తాజాగా ఈమె పడి పడి లేచె మనసు చిత్రంతో ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈమె తాను నటించే ప్రతి సినిమా స్టార్తో కూడా గొడవలు పెట్టుకుంటుందని, గొడవల గురించి గతంలో పలు సార్లు మీడియాలో నిలిచింది.
తాజాగా ఆ విషయమై హీరో శర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు.పడిపడి లేచె మనసు చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె తనతో నటించిందని కాదు కాని, ఆమె చాలా స్వీట్ పర్సన్ అని, ఆమె చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి.ప్రతి విషయాన్ని కూడా లోతుగా తెలుసుకోవాని ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చాడు.
ఆమెతో తాను ఒక్క సినిమా చేసినప్పటికి ఆమెతో మంచి స్నేహం ఏర్పడినదని, మళ్లీ మళ్లీ సాయి పల్లవితో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఇక ఇదే సమయంలో ఆసక్తికర విషయం ఒకటి చక్కర్లు కొడుతోంది.
సాయి పల్లవి హీరో శర్వానంద్ను అన్నయ్య అంటూ పిలిచేదట.
సినిమా కోసం కెమెరా ముందు రొమాన్స్ చేసిన సాయి పల్లవి, శర్వానంద్లు కెమెరా వెనుక మాత్రం అన్న చెల్లెలుగా మారిపోయేవారట.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అన్న అన్న అంటూ శర్వాను సాయి పల్లవి పిలిచేదని, ఆయన కూడా సాయి పల్లవి అలా పిలుస్తుంటే మురిసి పోయేవాడు.వీరిద్దరు అన్న చెల్లెలుగా భావన కలిగి ఉన్నారు కనుకే ఈ చిత్రంలో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ లేవేమో, అందుకే క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిందని చెబుతున్నారు.
ట్రైలర్లో మాత్రం రెండు మూడు హగ్ సీన్స్, కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న సీన్స్ కనిపిస్తున్నాయి.క్లీన్ యూ రావడంతో సినిమాలో అంతకు మించి వీరిద్దరి నుండి రొమాన్స్ ఆశించలేం అంటున్నారు.