యువ హీరో శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ రాధిక, ఖుష్బూ కూడా నటిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర యూనిట్.ఫిబ్రవరి 25న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.
వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక మందన్నఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారు.శర్వానంద్, రష్మిక జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
శర్వానంద్ మరోపక్క ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నారు.లాస్ట్ ఇయర్ మహా సముద్రం సినిమా ఎన్నో అంచనాలతో రాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.
రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శర్వానంద్. ఈ రెండు సినిమాల మీద శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.