తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.శర్వానంద్ ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.
ఈ మధ్యనే ఆయన చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రం’ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
తాజాగా ఈ సినిమా కథ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ ఇద్దరు చిన్న వయసు నుండే ద్వేషం పెంచుకుని ఆ ఆవేశంతో ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేదే స్టోరీ లైన్ అని టాక్.
శర్వానంద్, సిద్దార్థ్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది.ఈ సినిమాలో శర్వానంద్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించ బోతున్నాడట.శర్వానంద్ కు గమ్యం, ప్రస్థానం వంటి సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చనిపోతుంది తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో.