లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్ లకి కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.దీంతో ఇప్పటికే కొంత మంది షూటింగ్ స్టార్ట్ చేయగా మరికొంత మంది షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ వయస్సులో కరోనాని లెక్క చేయకుండా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.ఈ నేపధ్యంలో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కూడా స్పీడ్ పెంచి షూటింగ్ లకి సిద్ధం అవుతున్నారు.
మరో వైపు లాక్ డౌన్ సడలింపులలో భాగంగా తాజాగా థియేటర్లుకి కూడా పర్మిషన్ ఇచ్చారు.అయితే కేవలం 50 శాతం సిట్టింగ్ కి అనుమతి లభించింది.
త్వరలో ఈ నిబంధనలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా విజృంభిస్తున్నా ప్రజలు పెద్దగా లెక్క చేయడం లేదు.
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యధావిధిగా ప్రయాణాలు సాగిస్తున్నారు.ఇదిలా ఉంటే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ కోసం చాలారోజుల తర్వాత బయటకి వచ్చాడు.
శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం చివరి షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ నెలాఖరుతో సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది.ఈ నేపధ్యంలో షూటింగ్ కోసం శర్వానంద్ చెన్నై బయలుదేరి వెళ్ళాడు.షూటింగ్ కోసం బయటకి వచ్చిన శర్వానంద్ కాస్తా ఉత్సాహంగా ఉన్నాడు.
మొదటి సారి స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నట్లు ఉందని మీడియాతో తన ఫీలింగ్ పంచుకున్నాడు.ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో రీతూవర్మ శర్వానంద్ కి జోడీగా నటిస్తూ ఉండగా, అమల అక్కినేని ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
.