కొన్ని సినిమాలు చూస్తే మనతో మనం ప్రయాణం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.అలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.
ఆ సినిమాలు చూసినపుడు నిజంగానే గతం యొక్క మధుర స్మృతులు అన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ ఉంటాం.ఇప్పుడు అలాంటి కోవలో వస్తున్న సినిమానే జాను.
తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 96 రీమేక్ గా ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, మెలోడీ సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇక ఈ ట్రైలర్ లో ఎదురుచూసే తీరాన్ని నేను అంటూ పొయిటిక్ గా శర్వానంద్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ చేసి అలా స్కూల్ వయసులో ప్రేమ కథని చూపిస్తూ చాలా గ్యాప్ తర్వాత మరల జాను, రామచంద్రన్ కలుసుకొని వారి జ్ఞాపకాలని, వారి అనుభూతులని ఒకరితో ఒకరు ఎలా పంచుకున్నారు అనే ఎలిమెంట్స్ ని దర్శకుడు చూపించాడు.
ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏదో తెలియని అనుభూతితో మనల్ని కూడా స్కూల్ వయసుకి తీసుకెల్లినట్లు అనిపిస్తుంది.ఒరిజినల్ కి మక్కీకి మక్కీ దించినట్లు ఉన్న కూడా తెలుగు నేటివిటీ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తుంది.
ప్రేమికుల రోజు తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఏది ఏమైనా శర్వానంద్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టడం పక్కా అని మాత్రం అనిపిస్తుంది.