ఇప్పుడు అన్ని భాషలలో పాన్ ఇండియా మూవీల హవా ఎక్కువ అయిపొయింది.సినిమాల విషయంలో భాషల అడ్డుగోడలు తొలగిపోయాయి.
అన్ని భాషలలోని హీరోలు ఇతర భాషలలో కూడా తన హవా కొనసాగించడం కూసం చూస్తున్నారు.సరిహద్దులు చెరిపేసి సినిమాలు తీస్తున్నారు.
ఈ వరుసలో టాలీవుడ్ స్టార్స్ ముందు వరుసలో ఉన్నారు.ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టారు.
హిందీలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమాలు సౌత్ భాషలలో కూడా సూపర్ హిట్ అయ్యింది.అలాగే హృతిక్ రోషన్ సినిమాలకి కూడా సౌత్ లో మంచి మార్కెట్ ఉంది.
ఈ మధ్య సల్మాన్ ఖాన్ సినిమాలకి కూడా ఆదరణ లభిస్తుంది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సౌత్ లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్, షారుక్ కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.వీరి ఇమేజ్ కి సరిపోయే కథని నిఖిల్ అద్వాని సిద్ధం చేసాడని టాక్ వినిపిస్తుంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కరణ్ అర్జున్ సంచలన విజయాన్ని సాధించింది.
మరోసారి ఈ కాంబినేషన్లో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలెట్టారని తెలుస్తుంది.అయితే ఈ సినిమాని కేవలం హిందీకి మాత్రమే పరిమితం చేయకుండా పాన్ ఇండియా మూవీగా సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అందులో భాగంగా ఇందులో కీలక పాత్రల కోసం సౌత్ స్టార్ నటులని కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం.