కరోనా
విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వంకు పలువురు స్టార్స్ వ్యాపారవేత్తలు భారీగా విరాళాలు ఇస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్
25 కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.
ఆయన్ను రియల్ హీరో అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదే సమయంలో
బాలీవుడ్
లో ఉన్న ఇతర స్టార్ హీరోల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆ హీరోలకు కనీస బాధ్యత లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అమీర్ ఖాన్ 250 కోట్ల విరాళం అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని క్లారిటీ వచ్చేసింది.
ఆయనతో పాటు
షారుఖ్ ఖాన్
కూడా ఇప్పటి వరకు విరాళంను ప్రకటించలేదు.కాని ఆయన అభిమానులు మాత్రం ఇచ్చే విరాళం అనేది పబ్లిసిటీ కోసం కాదని, జనాలకు ఉపయోగపడేలా చేయాలంటున్నారు.
షారుఖ్ ఖాన్ తనకున్న మంచి మనసుతో ఇప్పటికే సాయం చేశాడంటూ కొందరు అభిమానుల
సోషల్ మీడియా
లో చెబుతున్నారు.
బాలీవుడ్ ప్రముఖులు మాత్రం షారుఖ్ ఇప్పటి వరకు విరాళం ఇవ్వడం కాని ప్రధానితో మాట్లాడటం కాని చేయలేదని, తన ఆఫీస్లో వర్క్ చేసేవారు, తన
రెడ్ చిల్లీస్లో వర్క్ చేసే డైలీ లేబర్స్
ను కాని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు.
దాంతో ఇంతకు షారుఖ్ ఖాన్ విరాళం ఇచ్చాడా ఈ సమయంలో ఈయన హీరోగానే మిగిలి పోతాడా రియల్ హీరో అవుతాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.