మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే.ఇదంతా బీజేపీ పార్టీ కనుసనల్లోనే జరిగినట్లుగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది.
ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి.ప్రస్తుతం విచారణ జరుగుతుంది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు.వైయస్ షర్మిల స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంకి సంబంధించి కేసీఆర్ పై విమర్శలు చేశారు.ఎమ్మెల్యేలతో “నాలుగు స్తంభాలాట” అనే సినిమా కేసీఆర్ విడుదల చేస్తారని సెటైర్లు వేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒక బూటకం అని మండిపడ్డారు.ఈ అంశంపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోవటం లేదని నమ్మటం లేదని తోసిచ్చారు.
ఇదే సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కనిపించడం లేదన్న విషయాన్ని పోలీసులు గమనించాలని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన టైములో బాలకిషన్ బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష రూపాయలు ఉండగా ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని.
షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.