తెలంగాణలో సంచలన విషయాలతో పెద్ద ఎత్తున రాజకీయవేడి రాజుకొంటోంది.బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుని ఎంపిక రచ్చ ఇలా రాజకీయం రంజుగా మారిందని చెప్పుకోవచ్చు.
ఇక వీటికి తోడు ఇప్పుడు మరొక సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ సోదరి వై.యస్.షర్మిళ తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనుందనే వార్త తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
తాజాగా షర్మిల పార్టీ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు.షర్మిల పార్టీ పెట్టాలనుకుంటే ఏపీలో పెడితే ప్రయోజనం ఉంటుందని, తెలంగాణలో పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.
తెలంగాణలో వై.యస్.రాజశేఖర్ రెడ్డికి పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు.వై.యస్.ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాలతో వై.యస్ ప్రజలలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అంతేకాక వై.యస్ షర్మిళ తెలంగాణలోనూ పాదయాత్ర చేపట్టింది.షర్మిళ పార్టీ పెట్టబోతున్నారన్న వార్త వై.యస్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.చూద్దాం ఈ వార్త నిజమైతే తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.