తెలంగాణ రాజకీయాలలో కొత్త కొత్త పార్టీలు ఉద్భవిస్తూ సరికొత్త నినాదంతో సరికొత్త వ్యూహాత్మక ఎత్తుగడతో కెసీఆర్ టార్గెట్ గానే ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటు బీజేపీ గతంతో పోలిస్తే కాస్త బలపడినా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే వైయస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాదయాత్రలు, దీక్షలతో కెసీఆర్ పై వ్యతిరేకత పెరిగేలా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.అయితే షర్మిల ఎంత ఘాటుగా విమర్శల వర్షం కురిపిస్తున్నా అసలు ఏ రాజకీయ పార్టీ పట్టించుకుంటున్న పరిస్థితి లేదు.
ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి స్వచ్ఛంద సంస్థల గురించి నేను సమాధానం ఇవ్వడం ఏంటని, మీడియా కూడా అంతగా ఆమె మాటలను సీరియస్ గా తీసుకోవద్దని కూడా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి.
అయితే కెసీఆర్ ను టార్గెట్ చేస్తున్నా ప్రతిపక్షాలు కూడా కనీసం ఒక పార్టీగా కూడా ఒక నాయకురాలిగా కూడా షర్మిలను పట్టించుకోవడం లేదు.
ఒకవేళ షర్మిలను ప్రతిపక్షాలు పట్టించుకుంటే ఇక కెసీఆర్ చేతికి ప్రతిపక్షాలు చిక్కినట్టే.ఇక ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళి ఇక ప్రతిపక్షాలు ఎంతగా ప్రజల్లోకి కెసీఆర్ వైఫల్యాలను తీసుకెళ్లినా ప్రజల దృష్టి కెసీఆర్ విమర్శల వైపే ఉండేట్లుగా కెసీఆర్ పావులు కదిపే అవకాశం ఉంది.
అయితే దీక్షల పేరుతో, పాదయాత్రల పేరుతో ఎంతగా చేసినా ఒక చిన్న పార్టీ కూడా షర్మిలను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడంతో కెసీఆర్ వదిలిన బాణం షర్మిలనా అనే సందేహం కొంత మందిలో వస్తోంది.అయితే షర్మిల పార్టీ ప్రకటన విషయం బయటికి వచ్చినప్పుడు ఇలాంటి వార్తలే రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.