తెలంగాణ రాజకీయాలలో షర్మిల సరికొత్త నిర్ణయం కలకలం రేపుతోంది.కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ మీడియా ముందు షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు రక రకాలుగా స్పందిస్తున్నారు.
మరోపక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో మరియు ఆత్మీయులతో సమావేశం అవుతానని చెప్పిన షర్మిల స్పీడ్ పెంచారు.
ఇప్పటికే నల్గొండ మరికొన్ని జిల్లాలకు చెందిన నాయకులతో భేటీ అయిన షర్మిల ఈరోజు హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశం అవ్వడానికి రెడీ అయ్యారు.
మరోపక్క ఈ నెల 21వ తారీఖున ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులతో సమావేశం అవటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఖమ్మంలో గిరిజనులు అదేవిధంగా ఆదివాసులు ఇబ్బంది పడుతున్న పోడు భూముల సమస్య పరిష్కరించే దిశగా ఉద్యమానికి షర్మిల రెడీ అవుతున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వటంతో ఖమ్మం లో ఈనెల జరగాల్సిన టూర్ మార్చి 14వ తారీఖున జరిగే అవకాశం ఉన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.ఏదిఏమైనా షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో వరుసపెట్టి భేటీలు నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
.