తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మంగళవారం వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తారీకు డిచ్ పల్లిలో నిరుద్యోగ దీక్ష చేయడం జరిగింది.
సభ ముగిసే సమయంలో షర్మిల ప్రసంగం చేస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పసుపు బోర్డు విషయంలో ఎంపీ అరవింద్ ప్రజలను వంచించారు అని పేర్కొన్నారు.
ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన అరవింద్.ఇప్పుడు ప్లేట్ మార్చాడని ప్రజలను మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయటం జరిగిందని షర్మిల ధ్వజమెత్తారు.నిజామాబాద్ జిల్లాలో సాలూరు ప్రాజెక్ట్ నీ.అప్పట్లో వైయస్ఆర్ కట్టడం జరిగిందని రైతులకు ప్రజలకు అనేక రీతులుగా వైయస్సార్ తన పాలనలో మంచి చేశారని షర్మిల తెలిపారు.మొత్తంమీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నట్లు షర్మిల నిరుద్యోగ దీక్ష లో సీరియస్ కామెంట్లు చేశారు.