వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం “నిరుద్యోగ దీక్ష” అదే రీతిలో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం గురించి భారీ స్థాయిలో రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇదే క్రమంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి కేటీఆర్ ఎవరు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కీలక పార్టీలు ఇప్పటికే వ్యూహాలు వేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా టిఆర్ఎస్- బిజెపి పార్టీలు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరిస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి షర్మిల స్పందిస్తూ తమ పార్టీ పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఉప ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం గుంటూరు సంచలన కామెంట్ చేశారు.ఇటువంటి ఓపెన్ ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందా.? దళితులకు భూమి ఏమైనా ఇస్తుందా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తే ఖచ్చితంగా తాము పోటీ చేస్తామని, హుజురాబాద్ ఉప ఎన్నిక కేవలం పగ ప్రతీకారం కోసం.జరుగుతున్న ఎన్నికలు అంటూ షర్మిల కాంట్రవర్సీ కామెంట్ చేశారు.