హుజురాబాద్ ఉప ఎన్నికల పై సంచలన కామెంట్స్ చేసిన షర్మిల..!!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం “నిరుద్యోగ దీక్ష” అదే రీతిలో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం గురించి భారీ స్థాయిలో రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు.

 Sharmila Sensatational Comments Huzurabad By Elections Ys Sharmila, Bjp, Trs, Hu-TeluguStop.com

ఇదే క్రమంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి కేటీఆర్ ఎవరు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కీలక పార్టీలు ఇప్పటికే వ్యూహాలు వేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా టిఆర్ఎస్- బిజెపి పార్టీలు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరిస్తూ ఉన్నాయి.ఇలాంటి తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి షర్మిల స్పందిస్తూ తమ పార్టీ పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఉప ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం గుంటూరు సంచలన కామెంట్ చేశారు.ఇటువంటి ఓపెన్ ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందా.? దళితులకు భూమి ఏమైనా ఇస్తుందా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తే ఖచ్చితంగా తాము పోటీ చేస్తామని, హుజురాబాద్ ఉప ఎన్నిక కేవలం పగ ప్రతీకారం కోసం.జరుగుతున్న ఎన్నికలు అంటూ షర్మిల కాంట్రవర్సీ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube