ఫస్ట్ టైం జై తెలంగాణ అంటూ షర్మిల..!!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టడానికి షర్మిల సరికొత్త అడుగులు వేస్తున్నట్లు వార్తలు కొద్ది కాలం నుండి తెలుగు రాజకీయాల్లో వినబడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో మరియు ఆత్మీయులతో షర్మిల భేటీ అవుతూ ఉన్నారు.

 Sharmila Says Jai Telangana For The First Time Trs,jai Telangana,sharmila,hydera-TeluguStop.com

జిల్లాల వారీగా జరుగుతున్న ఈ భేటీలో తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైయస్ మద్దతుదారులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగించడానికి ముందు ఫస్ట్ టైం జై తెలంగాణ అంటూ షర్మిల నినదించి అప్పుడు తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు.

దీంతో సమావేశానికి వచ్చిన రెండు జిల్లాల వైఎస్ అభిమానులు కూడా జై తెలంగాణ అంటూ గట్టిగా నినదించారు.ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ ప్రజలకు చేయాల్సిన పని చేస్తుందా ? అని ప్రశ్నించారు.అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యింది అంటూ షర్మిల నిలదీశారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని 11 ప్రశ్నలతో ఫీడ్ బ్యాక్ కలిగిన ఫారం నింపాలని తనతో సమావేశమైన అభిమానులను షర్మిల కోరారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube