ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఇటీవల ఆయన నివాసంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు బోన్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది.
అనంతరం హాస్పిటల్ లో జాయిన్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకున్న మందకృష్ణ మాదిగ తాజాగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనను తాజాగా వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కలవడం జరిగింది.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.
అలాగే, సెప్టెంబరు 12న వైఎస్సార్ తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే దళిత భేరి బహిరంగ సభకు ఆయనను ఆహ్వానించాను’ అని షర్మిల సోషల్ మీడియాలో తెలిపారు.ఇదిలా ఉంటే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.