వైఎస్సార్ టీపీ పార్టీ అధినేత వై.ఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో జోరు పెంచిన విషయం తెలిసిందే.
ఇక ఇన్ని రోజులు పార్టీ ఏర్పాటు, అభివృద్ధిపై దృష్టి పెట్టిన షర్మిల ఇక అసలు సిసలు రాజకీయంలోకి దూకబోతున్నది.ఇక షర్మిల ముందు అనేక సవాళ్ళు ఉన్న విషయం విదితమే.
అయితే ఏ ప్రతిపక్ష రాజకీయ నాయకుడైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా సహజం.కానీ షర్మిల మాత్రం చాలా క్లారిటీతో ప్రజల్లోకి వెళ్లాలంటే విమర్శలు ఒక్కటే కాదని గ్రహించిన షర్మిల ఇక విమర్శల కోణాన్ని మార్చింది అనుష్క.
ఇక తాజాగా కెటీఆర్ అంటే ఎవరో తెలియదని చెప్పి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త రకం విమర్శలకు తెరదీసి పెద్ద ఎత్తున ట్రోల్ కు గురయ్యారు షర్మిల.అయితే ఇక ఇప్పటి నుండి దీక్షలను నిర్వహిస్తూనే ఘాటు విమర్శలతో తెలంగాణ రాజకీయాలలో దూసుకపోనున్నారు షర్మిల.
ఆ దిశగా పీకే టీం కూడా షర్మిలకు తెలంగాణ రాజకీయ పరిస్థితులను బట్టి సూచనలు చేస్తున్నట్టు సమాచారం.ఏది ఏమైనా షర్మిల రాజకీయ వ్యూహాలు కొత్త పుంతలు తొక్కుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్ని రంజుగా మార్చే అవకాశం కనిపిస్తోంది.
మరి షర్మిల తన పార్టీతో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.