సోషల్మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్మీడియాలో పోస్టులు పెట్టడం బాధాకరమని, వీటి వెనుక తెదేపా హస్తం ఉందని ఆమె ఆరోపించారు.
షర్మిల ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.పోలీస్ కమిషనర్ కార్యాలయం దీనిని సైబర్ సెల్కు పంపించింది.దర్యాఫ్తు చేయాలని ఆదేశించారు.దీంతో కేసు నమోదు చేసి, దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.సులో పరువు నష్టం లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలు పెట్టి, నాకు సినీ హీరో ప్రభాస్కు సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్లైన్లో దుష్ప్రచారాన్ని చేసింది.ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశాము.గత కొద్ది రోజుల క్రితం పోలీసుల చర్యలతో ఈ వార్తలు ఆగినా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మళ్లీ ప్రచారం మొదలయ్యిందని ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కలిశాము.ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదు.ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు.స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని, మన సమాజం ఆమోదించవచ్చా?
తనపై వెబ్ సైట్లలో, సోషల్ మీడియా లో వస్తున్న వార్తలకు వ్యతిరేకంగా తాను చేసిన ఫిర్యాదును అందరూ సమర్ధించాలని షర్మిల కోరారు.తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిని, చేపిస్తున్న వారని కఠినంగా శిక్షించాలన్నారు.వారి వల్ల ప్రస్తుతం తాను ఇలా దోషిగా నిలబడాల్సి వచ్చిందన్నారు.
ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా తన నైతికతను నిజాయితిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు.కానీ బయట జరుగుతున్న ప్రచారంపై తాను మాట్లాడకుంటే అదే నిజమని కొందరు భావించే అవకాశం వుంది కాబట్టి బయటకు వచ్చి దానిపై మాట్లాడుతున్నట్లు షర్మిల వెల్లడించారు.