2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు దేవి ప్రసాద్ దర్శకత్వం వహించినటువంటి కెవ్వు కేక చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, షర్మిల మాండ్రే నటించారు.
తాజాగా షర్మిలా మాండ్రే రాత్రిపూట పార్టీకి వెళ్లి వస్తూ ఎక్కువ స్పీడ్ తో కారు నడుపుతూ ప్రమాదానికి గురైంది. అయితేఈ విషయానికి సంబంధించి ఓ వార్త నెట్లో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే షర్మిల మాండ్రే పార్టీ కి వెళ్లి వస్తూ ఉండగా మద్యం సేవించి ఉందని అందువల్ల సోయి లేకుండా కారు నడపడంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టిందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.దీంతో తాజాగా ఈ వార్తలపై నటి షర్మిలా మాండ్రే స్పందించింది.
ఇందులో భాగంగా తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎటువంటి నిజం లేదని కొట్టిపారేసింది. అంతేగాక ఆ సమయంలో తాను పార్టీకి వెళ్లలేదని చిన్నపాటి అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రికి వెళ్లి వస్తున్నానని, అంతేగాక కారు ప్రమాదం జరిగిన సమయంలో తాను కారు నడపలేదని తన స్నేహితుడు నడిపాడని చెప్పుకొచ్చింది.
నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంకోసారి ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి కెవ్వు కేక చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ తమిళం కన్నడలో అవకాశాలు రావడంతో వెంటనే తన మకాం మార్చింది.
ఇందులో భాగంగా వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకు నోచుకోలేదు.అయితే కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా ఈ అమ్మడు వ్యవహరించింది.