మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచిపోయినప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.శివసేన పార్టీ ఎన్సీపీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని శివసేనప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
అయితే ఈ క్రమంలో చర్చలు కూడా జరిగి శివసేన డిమాండ్స్ ను కూడా ఇరు పార్టీలు ఒప్పుకొని పొత్తు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ విషయమై మరోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ భేటీ కంటే ముందు పవార్ బీజేపీ అధినేత ప్రధాని నరేంద్ర మోదీ ని కలుసుకోవడం ఇప్పుడు పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే ఈ భేటీ లో ఎలాంటి అంశాలను చర్చిస్తారు అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
ప్రస్తుతం మాత్రం పవార్ మోదీతో జరిపే సమావేశంలో రైతు సమస్యలపై చర్చించనున్నట్లు ఎన్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోపక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే పవార్ను ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రశంసించడం, ఈ రోజు వారిద్దరూ భేటీ కానుండడం తో ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి మహారాష్ట్ర లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.