యూట్యూబర్ గా ఎన్నో వీడియోలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు.ఇకపై ఈ కార్యక్రమంలో భాగంగా 8వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా షణ్ముఖ్ తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా షన్ను మాట్లాడుతూ… అమ్మ క్యాన్సర్ ను జయించావు.అమ్మమ్మ చనిపోతే ఆ బాధ నుంచి బయటపడ్డావు…నువ్వే నా ఇన్స్పిరేషన్ నేను కూడా నీలాగే ఈ బాధ నుంచి తొందరగా బయటపడతా అంటూ ఎమోషనల్ మాటలు మాట్లాడారు.
దీంతో షణ్ముక్ తల్లి ఉమారాణి పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది.
ఈ క్రమంలోనే షణ్ముక్ తల్లి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని షణ్ముఖ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ఇక షణ్ముఖ్ జీవితంలో దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే దీప్తి సునయన బయట ఉంటూ తన గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే షన్ను పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తన తల్లి ఉమారాణి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీప్తి సునయన షణ్ముక్ ఇద్దరు మంచి స్నేహితులు అని వారిద్దరూ పలు వీడియోలు వెబ్ సిరీస్ లో నటించడం వల్ల వారి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆమె తెలియజేశారు.ఒకవేళ వారిద్దరూ నిజంగా ప్రేమలో ఉంటే వారి ఇష్టప్రకారం వారి పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
అలాగే హౌస్ లో సిరితో కలిపి షణ్ముఖ గేమ్ ఆడుతున్నారని షణ్ముఖ్ గురించి వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించారు.వీరిద్దరూ ఒకే ఫీల్డ్ నుంచి వెళ్లడం వల్ల అందరికీ అలా అనిపిస్తుంది కానీ ఎవరికి వాళ్లు వారి ఆట ఆడుతున్నారని త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుందని ఉమారాణి వెల్లడించారు.