మొత్తానికి తెలుగు ప్రేక్షకుల కోరిక నెరవేరింది.బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవ్వగా.
ఈ సీజన్ ను చూడటానికి బాగా ఆసక్తి చూపుతున్నారు.పైగా రేటింగ్ కూడా బాగానే దూసుకుపోతుంది.
ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.ఎవరు కూడా ఇతరులతో కలిసి ఉంటున్నాము అన్న ఫీలింగ్ లేకుండా బాగా కలిసిపోయారు.
కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు.
యూట్యూబ్ స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నిజానికి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఎవరికి కూడా షణ్ముఖ్ జస్వంత్ కు ఉన్న ఫాలోయింగ్ లేదనే చెప్పాలి.అటువంటి షణ్ముఖ్ 3 ఎపిసోడ్ లు పూర్తయినా కూడా అందరితో అంత సులువుగా కలవలేకపోతున్నాడు.దీంతో సోషల్ మీడియాలో మళ్లీ షణ్ముఖ్ కు ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
‘ఏంట్రా ఇది’ అంటూ అంతమందిని చూసేసరికి తనకు అలా అనిపిస్తుంది అని ట్రోల్స్ చేస్తున్నారు.
నిజానికి ఈ హౌస్ లో బాగా సైలెంట్ గా ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే షణ్ముఖ్ అనే చెప్పాలి.మొత్తానికి షణ్ముఖ్ అలా ఉండటానికి ఒక కారణం ఉందని తెలిపాడు.తను ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అంటూ.ఇంతమంది తో ఎప్పుడు ఉండలేదు అంటూ అందుకే ఇలా ఫీలవుతున్నాను అని తెలిపాడు.
ఇక నెటిజన్లు కొందరు షణ్ముఖ్ జశ్వంత్ పక్కా ప్లాన్ తోనే నిశ్శబ్దంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరికొందరు బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.మరి షణ్ముఖ్ హౌస్ లో నోరు ఎప్పుడు విప్పుతాడో అని అసలు మాట్లాడతాడా లేదా అని తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.