నిఖిల్ – నందిత జంటగా నటించిన చిత్రం ” శంకరాభరణం “.ఎమ్ వి వి సత్యనారయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనపు దర్శకుడు.
స్టార్ రైటర్ కోన వెంకట్ కేవలం సమర్పకుడిగానే కాకుండా, కథ, మాటల రచయితగా, దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఈ చిత్రాన్ని నడిపించారు.
ఇక ఈ చిత్రం నైజాంలో 171 థియేటర్లలో, ఆంధ్రలో 182 థియేటర్లలో సీడెడ్లో 65+ థియేటర్లలో, ఒవర్సీస్ లో125+ థియేటర్లలో, ఇతర ప్రాంతాలు అన్ని కలుపుకోని ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
నిఖిల్ కెరీర్ లో ఉదే అత్యధికం.
ఉదయం ఆటలు హైదరబాద్ లో బాగానే మొదలయ్యాయి.
అయితే సిటి మినహా, మిగితా తెలంగాణ ప్రాంతాల్లో అంతగా సినిమా విడుదలైన కళ కనిపించలేదు.ఆంధ్రలో మధ్యాహ్నం ఆట నుంచి కలెక్షన్లు ఓ రేంజ్ లో పడిపోయాయి.
ఇక సీడేడ్ లో ఉదయం ఆట నుంచే ఉదాసీనంగా మొదలయ్యింది శంకరాభరణం.
ఒవర్సీస్ లో అంత భారిగా విడుదల చేస్తే, ప్రిమియర్స్ లో వచ్చింది కేవలం 16,000 డాలర్లు వచ్చాయి.
ఇలా భారతదేశంలోనే కాకుండా, బయటి దేశాల్లో కూడా పేలవంగా సాగింది తొలిరోజు.ఇంతకి ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది రేపు లేదా ఎల్లుండి తెలిసిపోతుంది.