అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.
భారీ బడ్జెట్ తో తన సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఉంటాడు శంకర్.ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈయన కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
అయితే గత కొన్ని రోజులుగా శంకర్ మధ్యలోనే వదిలేసిన ఇండియన్ 2 సినిమా గురించి చర్చ జరుగుతుంది.
కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు రాజీ తో మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు కోలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసేసింది.విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్సీ 15 ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న ఇష్యుల కారణంగా షూటింగ్ ఆగిపోయింది.దేంతో శంకర్ ఇండియన్ 2స్టార్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.మన దగ్గర షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియక పోవడంతో ఈ సినిమాకు శంకర్ షిఫ్ట్ అవుతున్నట్టు టాక్ వస్తుంది.
మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.