సౌత్ ఇండియాలో దిగ్గజ దర్శకులు ఎవరు అంటే రాజమౌళి ఆవెంటనే శంకర్ ల పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు.రాజమౌళి కంటే కూడా ముందు శంకర్ చాలా ఫేమస్ అయ్యాడు.
ఆయన సినిమాలు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాయి.అందుకే ఆయన సినిమాలు అంటే అక్కడ ఇక్కడ అన్ని భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
శంకర్ దర్శకత్వంలో మొదలైన ఇండియన్ 2 మూవీ మద్యలోనే ఆగిపోయింది.కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ వారు ఆ సినిమాను నిర్మిస్తుండగా ప్రమాదం జరిగి ఆగిపోయిన షూటింగ్ రెండేళ్లయినా ఇప్పటి వరకు మొదలు కాలేదు.
ఇప్పటి వరకు సినిమా గురించి పట్టించుకోవడం లేదంటూ లైకా ప్రొడక్షన్ వారు తమిళనాడు హైకోర్టును శంకర్ పై ఫిర్యాదు చేసి ఆశ్రయించడం జరిగింది.శంకర్ తమ సినిమాను కాకుండా మరో సినిమాను చేసేందుకు సిద్దం అయిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్బంగా లైకా ప్రొడక్షన్స్ వారు పిటీషన్ ను దాఖలు చేయడం జరిగింది.
ఇండియన్ 2 సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ నుండి 40 కోట్ల రూపాయల పారితోషికంను శంకర్ తీసుకున్నాడని అంటున్నారు.అదే విషయాన్ని కోర్టులో లైకా ప్రొడక్షన్ వారు పేర్కొనడం జరిగింది.
ఇండియన్ 2 సినిమా కు గాను 40 కోట్లు పారితోషికం తీసుకున్న శంకర్ కు చరణ్ తో నిర్మించబోతున్న సినిమాకు గాను దిల్ రాజు ఏకంగా 50 కోట్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.రామ్ చరణ్ మరియు శంకర్ల కాంబో మూవీని దిల్ రాజు దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
అందులో శంకర్ పారితోషికం 50 కోట్లుగా తెలుస్తోంది.ఇండియన్ 2 మూవీకే 40 కోట్లు తీసుకున్న శంకర్ ఈ సినిమాకు 50 కోట్లు తీసుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే ఆయనకు దిల్ రాజు ఇంత మొత్తం ఇచ్చి ఉంటాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.శంకర్ మొదటగా ఇండియన్ 2 సినిమా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంది.కనుక వారితో ఎలాంటి పరిష్కారంను శంకర్ చేసుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.