సౌత్ ఇండియా స్టార్ దర్శకుడుగా, భారీ చిత్రాల దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శంకర్.శంకర్ నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా భారీ తనం ఉట్టిపడుతుంది.
కమర్షియల్ ఫార్మాట్ కి సోషల్ కాన్సెప్ట్ ని యాడ్ చేసి సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట.అతను మొదటి నుంచి పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు తీస్తున్నారు.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా అనే పేరు వచ్చింది కానీ, అంతకంటే ముందుగానే శంకర్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళీ భాషలలో ఇక కాలంలో తన సినిమాలని రిలీజ్ చేసేవాడు.అతని సినిమాలకి తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం సంభవించి ఆగిపోయింది.
తరువాత లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.తరువాత లాక్ డౌన్ సడలింపులలో మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్న నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన లేదు.
అలాగే కమల్ హాసన్ కూడా రాజకీయాలతో బిజీ అయిపోయాడు.ఈ నేపధ్యంలో భారతీయుడు సీక్వెల్ ని శంకర్ పక్కన పెట్టి మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించే పనిలో పడ్డాడు.
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో పాటు, మరో కొత్త హీరో కలయిన లో పాన్ ఇండియా రేంజ్ లోనే ఒక సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారు.ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.