యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సాహో సినిమా నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకొన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని నిర్మాతలతో పాటు, వాళ్ళు కూడా దృవీకరించారు.
అయితే ఈ సినిమా నుంచి అంత పెద్ద స్టార్స్ తప్పుకోవడంకి కారణాలు ఏంటి అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి.తాజాగా శంకర్ మహదేవన్ సాహో నుంచి తాము తప్పుకోవడానికి కారణాలు ఏంటి అనేది చెప్పుకొచ్చాడు.
సాహోలో కొన్ని సాంగ్స్ ని వేరొక కంపోజర్లతో చేయించాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది.
ఈ విషయం మాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.
సినిమాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నాం.కాని దానికి చిత్ర యూనిట్ అంగీకరించకపోవడంతో సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఒక సినిమాకు ఎక్కువ మంది సంగీత దర్శకులు కలిసి పనిచేయడం ఈ మధ్య జరుగుతుంది.అయితే ఆ విషయంలో మేము అంతగా ఆసక్తి చూపించలేదు.
అదే విషయాన్ని నిర్మాతలతో చెప్పేసి తప్పుకున్నాం.మేము ఎక్కువ మంది కంపోజర్స్ తో కలిసి పనిచేయడం అంత సౌకర్యంగా భావించక పోవడం వలనే తప్పనిసరి పరిస్థితిలో సినిమా నుంచి తప్పుకున్నాం అని శంకర్ మహదేవన్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు వీరు తప్పుకోవడం ఈ సినిమా కోసం గిబ్రాన్ తో పాటు తమన్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.