మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేరకు పూర్తి అయ్యింది.ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనీ అనుకున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.
తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం శంకర్ ఇప్పటికే భారీ సెట్ వేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమాతో శంకర్ మరొకసారి తన మార్క్ కథతో రాబోతున్నాడని టాక్.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను మరొకసారి ఆకట్టుకోవాలని శంకర్ భావిస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.