తెలుగు సినీ నటుడు అల్లరి నరేష్.ఈ పేరు వినని ప్రేక్షకులే లేరు.ఎందుకంటే కితకితలు సినిమా తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.ఆ సినిమాతో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు.తొలిసారి అల్లరి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అల్లరి నరేష్.ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
ఎక్కువ కామెడీ సినిమాలలో నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ మధ్య వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా.కాస్త కొత్త పాత్రలతో పరిచయమవుతున్నాడు.పూర్తిగా కామెడీని తగ్గించేశాడు.ఇటీవలే విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన నాంది సినిమాలో నటించగా అందులో ఖైదీ పాత్రతో బాగా మెప్పించాడు.
అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ కు ఓ అవమానం ఎదురయిందట.
తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్న అల్లరి నరేష్.తాను తొలి సినిమా షూటింగులో ఓ అవమానాన్ని ఎదుర్కొన్నాడట.ఎన్నో సినిమాలు చేసిన తనకు తొలి సినిమా పంచిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ, అదొక జ్ఞాపకంగా నిలిచిపోయిందని తెలిపాడు.తాను తొలిసారి కెమెరా ముందుకు వెళ్ళిన రోజు, తొలి సన్నివేశం చిత్రీకరిస్తున్న సందర్భం ఇప్పటికీ గుర్తుందట.
హీరోయిన్ శ్వేత, తను బైకులో వెళుతూ మాట్లాడుకునే సన్నివేశంలో రామానాయుడు స్టూడియో లో కూర్చుని రిహార్సల్ చేసుకొని వెళ్లారట.జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మొదలు పెట్టారట.
ఇక ఆ సినిమాకి పరిమిత సంఖ్యలో బృందం పని చేయగా.తమ ముందు మారుతి వ్యాన్ లో కెమెరా ఉండటంతో అక్కడ అందరికీ షూటింగ్ అని అర్థమయిందట.
దీంతో ట్రాఫిక్ లో అటూ ఇటూ ఉన్న వాళ్లు ‘ఏ సీరియల్ లో నటిస్తున్నావు భయ్యా’ అని అన్నారట.దాంతో చాలా ఫీల్ అయ్యానని తెలిపాడు.
ఇక ఆ తర్వాత తను కూడా తన సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఎవరు గుర్తుపట్టలేదు అని ఇంటర్వెల్ తర్వాత పలువురు గుర్తుపట్టగా తన దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారట.అప్పుడు తనకు బాగా కిక్ అనిపించింది అని తెలిపాడు అల్లరి నరేష్.