అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న భామ శాలిని పాండే.సినిమాలో అవకాశాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలకి అర్జున్ రెడ్డి రూపంలో సూపర్ సక్సెస్ దొరికింది.
ఈ సినిమా తర్వాత ఆమెకి ఆశించిన స్థాయిలో భాగానే అవకాశాలు వచ్చాయి.అయితే అర్జున్ రెడ్డి రేంజ్ లో మరో సూపర్ సక్సెస్ ఆమె కెరియర్ లో పడలేదు.
దీంతో కుర్ర హీరోలకి జోడీగా నటిస్తున్న ఏదో నామమాత్రంగానే అమ్మడు ఇమేజ్ ఉంది.అయితే అవకాశాలు మాత్రం చేతిలో భాగానే ఉన్నాయి.
ఈ మధ్య ఓ హిందీ సినిమాలో లీడ్ హీరోయిన్ గా శాలినీ పాండేకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.దీంతో ఈ అమ్మడు ముంబైకి మకాం మార్చేసింది.
ప్రస్తుతం అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాలో కూడా శాలిని ముఖ్యపాత్రలో నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.
లాక్ డౌన్ తర్వాత అందాల భామలు చాలా మంది ఇళ్లకే పరిమితం అయిపోయారు.ఈ టైంలో రకరకాలుగా కాలక్షేపం చేస్తూ వాటికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో చేతిలో మద్యం గ్లాసుతో ఓ బాత్ టబ్ లో సముద్ర తీరంలో జాలీగా గడుపుతున్న ఫోటో పెట్టింది.రిలాక్స్ కోసం మందు తాగుతున్నట్లున్న ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
దీనిపై నెటిజన్ల ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఇలాంటి సమయంలో కనీసం సోషల్ రెస్పాన్స్ లేకుండా మద్యాన్ని ప్రోత్సహించే విధంగా ఫోటోలు పోస్ట్ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చేతిలో సినిమాలు లేకపోయినా ఇలాంటి ఫోజులకి మాత్రం తక్కువ లేదు అంటూ విమర్శిస్తున్నారు.మరి తనపై వస్తున్న విమర్శలపై శాలినీ పాండే ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.