తెలుగు ఇండస్ట్రీ నుంచి సిద్ధం కాబోతున్న మరో పీరియాడికల్, మైథలాజికల్ మూవీ శాకుంతలం.మహాభారతం మొదటి పర్వంలోని శకుంతల, దుశ్యంతుడి ప్రేమ కథ ఇప్పటి వరకు పుస్తకాలకే పరిమితం అయ్యింది.
మహాభారతం ఆధారంగా చాలా సినిమాలు వచ్చిన ఈ ప్రేమకథని ఎవరూ కూడా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు.ఎన్నో ప్రేమకథలు మన చరిత్రలో ఉన్న వాటన్నింటికంటే గొప్పదిగా శకుంతల ప్రేమకథ ఉంటుంది.
ఇప్పుడు దీనికి దర్శకుడు గుణశేఖర్ దృశ్యరూపం ఇవ్వబోతున్నాడు.తన హోం ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించే పనిలో పడ్డారు.
ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసేశారు.విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించాలని గుణశేఖర్ అనుకుంటున్నారు.
హిరణ్యకశ్యప సినిమాని పక్కన పెట్టి దీనిని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే టైటిల్ రోల్ పోషిస్తుందని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు సమంత పేరు తెరపైకి వచ్చింది.ఈ మధ్య కాలంలో కమర్షియల్ కథలని పక్కన పెట్టి ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న సమంత పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా తన స్పీడ్ ని ఎ మాత్రం తగ్గించకుండా కొనసాగిస్తుంది.
ఈ నేపధ్యంలో గుణశేఖర్ ఇప్పుడు శకుంతల పాత్ర కోసం సమంతని ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని జనవరి 1న తెలియజేయనున్నట్లు గుణశేఖర్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
ఈ నేపధ్యంలో గుణశేఖర్ చెప్పబోయే అప్డేట్ హీరోయిన్ గురించే అయ్యి ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా సమంత ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఆమె కెరియర్ లో మరిచిపోలేని చిత్రంగా శాకుంతలం నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.