ఆదిపురుష్ మూవీ టీజర్ గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.కొంతమంది ఆదిపురుష్ సినిమాను రిలీజ్ కానివ్వమని ప్రకటనలు చేస్తున్నారంటే ఈ సినిమా టీజర్ కొంతమంది మనోభావాలను ఏ స్థాయిలో హర్ట్ చేసిందో సులభంగానే అర్థమవుతుంది.
తాజాగా ఆదిపురుష్ మూవీ గురించి శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా ఘాటుగా స్పందించారు.ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసి వందల కోట్ల రూపాయలు వృథా చేయవద్దని ఆయన అన్నారు.
రామాయణంను ఈ విధంగా తెరకెక్కిస్తే మాత్రం కుదరదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.రాముడు రాముడిగా కనిపించడం లేదని హనుమంతుడు హనుమంతుడిగా కనిపించడం లేదని ముఖేష్ ఖన్నా అన్నారు.
దేవుళ్లు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ లా ఉండరని రాముడు, కృష్ణుడు బాడీ బిల్డర్స్ కారని వాళ్లు ముఖాలు ఎప్పుడూ విధేయతతో సున్నితంగా ఉంటాయని ముఖేష్ ఖన్నా వెల్లడించడం గమనార్హం.
రాముడు, కృష్ణుడు కోమలమైన సౌందర్యంను కలిగి ఉంటారే తప్ప మీసాలు, గడ్డాలు కలిగి ఉండరని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు.
సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సమయంలో రాతియుగపు మనిషి కథ అని చెప్పి ఉంటే బాగుండేదని ప్రేక్షకుల విశ్వాసంతో మేకర్స్ ఆటలాడుతున్నారని ముఖేష్ ఖన్నా కామెంట్లు చేశారు.అవతార సినిమాను స్పూర్తిగా తీసుకుని పాత్రలను తీర్చిదిద్దడం కరెక్ట్ కాదని ముఖేష్ ఖన్నా తెలిపారు.
ఆదిపురుష్ ఫిక్షనల్ స్టోరీ అని మీరు చెప్పుకోవచ్చని దయచేసి రామాయణం అని మాత్రం చెప్పవద్దని ముఖేష్ ఖన్నా కామెంట్లు చేశారు.ఇతిహాసాలు, మత విశ్వాసాలను మార్చడానికి డబ్బులు వృథా చేయవద్దని ఆయన కోరారు.ఇతర మతాలతో ఇలాగే చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.