దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, పోకిరి సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటి ఇలియానా.ఆ సినిమా తర్వాత ఇలియానా టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంది.
స్టార్ హీరోతో జోడి కట్టి సందడి చేసింది.ఎన్టీఆర్ తో రాఖి సినిమాతో పాటు శక్తి సినిమాలో కూడా నటించింది.
ఇలియానా టాలీవుడ్ లో ఎంత వేగంగా ఇమేజ్ పెంచుకుందో అంతే వేగంగా ఇక్కడి నుంచి బాలీవుడ్ కి జంప్ అయిపోయింది.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నించిన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించిన కూడా ఈ అమ్మడు అనుకున్న ఇమేజ్ రాలేదు.
మళ్లీ అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ సినిమా తనకు మరో డిజాస్టర్ గా మిగిల్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తాను నటించిన శక్తి సినిమా గురించి ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.దర్శకుడు తనకు మొదటిగా చెప్పిన కథ ఒకటైతే ఫైనల్ గా ప్రజెంట్ చేసిన విధానం వేరుగా ఉందని ఈ కారణంగా తను సినిమా ప్రమోషన్ కి వెళ్లలేదని చెప్పింది.
కథలో ఇష్టానుసారంగా మార్పులు చేయడం వల్ల శక్తి సినిమా అవుట్ పుట్ చూసుకున్న తర్వాత తను కనెక్ట్ కాలేక పోయాను అని స్పష్టం చేసింది.హీరోయిన్స్ ని ప్రెజెంట్ చేసే విధానం టాలీవుడ్ లో వేరేగా ఉంటుందని, మొదటిగా చూపించింది ఒకటైతే తరువాత తీసేది ఒకటవుతుందని చెప్పినట్లు బీ టౌన్ లో వినిపిస్తుంది.
.