షకీలా నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ చిత్రం నేరుగా డిజిటల్ ఫార్మట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.మూడు సంవత్సరాలుగా సినిమా సెన్సార్ కోసం తిరిగిన షకీలా ఇక లాభం లేదనుకుని డిజిటల్లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఆ సమయంలో తాను ఈ సినిమా కోసం చేసిన అప్పులు వడ్డీ కూడా కట్టలేక పోతున్నాను.ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి అంటూ విజ్ఞప్తి చేసింది.
మగాళ్లంతా ఈ సినిమాను చూస్తే నా ఆర్థిక సమస్యలు తొలగి పోతాయంటూ ఆమె చెప్పుకొచ్చింది.
సినిమాను ఇటీవలే అన్నట్లుగానే విడుదల చేసింది.
రెండు రోజుల్లో దాదాపుగా నాలుగు వేల మంది సినిమాను చూశారట.మంచి స్పందన వచ్చి సినిమాను ఇంకా చూసేందుకు వస్తున్నారు.
ఒకొక్కరికి టికెట్టు ధర 50 రూపాయలు మాత్రమే నిర్ణయించింది.అయినా కూడా కొందరు ఈ సినిమాను పైరసీ చేశారు.
ఇప్పటికే సినిమాను తమిళ్ రాకర్స్ లో పోస్ట్ చేశారు.ఈ పరిణామంతో షకీలా షాక్ అయ్యిందట.
ఆర్థికంగా నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో పైరసీ చేయడంకు మనసు ఎలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
నేను ముందే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను అంటూ చెప్పాను.అయినా కూడా వారు పైరసీ చేశారు అంటే వారు ఒక్క తండ్రికి పుట్టిన వారు అయ్యి ఉండరు అంటూ షకీలా ఘాటు వ్యాఖ్యలు చేసింది.వారు కడుపుకు అన్నం తినడం లేదేమో అంది.
దయచేసి పైరసీ కాకుండా ఒరిజినల్ వర్షన్ తన డిజిటల్ థియేటర్లోనే సినిమా చూడండి అంటూ షకీలా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.