అమెరికాలో వేలానికి షాజహాన్ వజ్రాల కత్తి..

భారత దేశం నుంచీ దొంగచాటుగా ఎన్నో విలువైన వస్తువులని, బంగారు ఆభరణాలని దొంగిలించుకుని పోయారు విదేశీయులు.ఎంతో విలువైన ఇప్పటి కరెన్సీ ప్రకారం కొట్లలో పలికే ఈ వస్తువులని వేలానికి పెడుతూ ఉంటారు కూడా.

 Shajahan Knife Ready For Auction-TeluguStop.com

ఈ క్రమంలోనే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కి చెందినా వజ్రాలు పొదిగిన కత్తి, అదేవిధంగా, కపుర్తలా రాజు జగత్‌జిత్‌ సింగ్‌కు చెందిన ఖడ్గం వేలం వేయనుంది.

అంతేకాదు దాదాపు 400 పురాతన వస్తువులని జూన్ 19న వేలం వేయనున్నట్టుగా న్యూయార్క్ లోని క్రీస్టీ సంస్థ తెలిపింది.సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్‌జిత్‌ సింగ్‌ ఖడ్డం ప్రారంభ ధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించారు.అలాగే మొఘల్‌ చక్రవర్తి షాజహాన్ కి చెందినా కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో వేలానికి షాజహాన్ వ

జైపూర్ రాజు సవాయ్ మాన్ సింగ్ భార్య రాణి గాయత్రీ దేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావచ్చొని అంచనా వేస్తున్నారు.పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం సుమారు రూ 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని సంస్థ తెలిపింది.వీటిని వేలం వేసేలోగా, జూన్‌ 14-18 మధ్య న్యూయార్క్ లో ప్రదర్సనకి ఉంచనున్నట్లుగా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube