ఒకప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్ లో ఎక్స్ పోర్ట్ అవ్వాలి అంటే చాలా కష్టం అయిపోయేది.కానీ బాహుబలి చిత్రం తరువాత బాలీవుడ్ కూడా తెలుగు సినిమాల రీమేక్ ల కోసం తెగ ఎగబడుతుంది.
మొన్న తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్,కైరా అద్వానీ లు జోడీ గా నటించి మంచి హిట్ సంపాదించిన సంగతి తెలిసిందే.అయితే ఇక ఇప్పుడు జెర్సీ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కించడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నాడు.
అయితే ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు షాహిద్ ని ఎంపిక చేసుకోవాలని కరణ్ భావిస్తున్నాడట.దీనితో షాహిద్ ను డేట్స్ కోసం కోరగా ఇప్పటికే కబీర్ సింగ్ విజయం తో జోరు మీదున్న గురుడు ఈ చిత్రం కోసం ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్ చేసాడట.మరి అక్కడ ఉంది గ్రేట్ ప్రొడ్యూసర్ కదా అందుకే ఏమి ఆలోచించారో ఏమో గానీ అంత మొత్తం ఇవ్వడానికి కూడా ఆయన సిద్దమైనట్లు టాలీవుడ్ సినీవర్గాల సమాచారం.
ఇటీవల షాహిద్ హీరో గా నటించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ విడుదల అయి దాదాపు రూ.300 కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే.దీనితో బాలీవుడ్ లో షాహిద్ రేంజ్ మారిపోయింది.అందుకే అయ్యగారు ఇంత మొత్తం డిమాండ్ చేస్తున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల భోగట్టా.మొత్తానికి అర్జున్ రెడ్డి అటు టాలివుడ్ లో విజయ్ దేవరకొండ కు మంచి బ్రేక్ ఇవ్వడమే కాకుండా కబీర్ సింగ్ కూడా షాహిద్ కు బాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి.