పాకిస్తాన్ క్రికెట్ లో కరోనా కలకలం రేగింది.క్రికెట్ కి వీడ్కోలు చెప్పి తన స్వచ్చంద సంస్థ ద్వారా ఈ మధ్య కాలంలో సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్న మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకింది.
లాక్ డౌన్ కాలంలో కూడా ప్రజలకి స్వచ్చంద సంస్థ ద్వారా సేవలు అందించిన షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది.ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియా ద్వారా అఫ్రిది తెలిపాడు.
నేను అనారోగ్యంగా ఉన్నా.నా శరీరం తీవ్రంగా బాధపడుతోంది.
కరోనా టెస్టులు చేయించుకున్నా.దురదృష్టవశాత్తూ కరోనా పాజిటివ్గా తేలింది.
త్వరగా కోలుకోవడానికి ప్రార్థనలు కావాలి అని అఫ్రిది ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
కరోనా ఫండ్ రైజింగ్లో భాగంగా మే నెల మొదట్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం బ్యాట్ను ఆక్షన్లో అఫ్రిది కొన్నాడు.
ముష్ఫికర్ రహీంకు ఓ బయ్యర్ దొరికారు. మంచి కార్యక్రమంలో పాక్ మాజీ ఆల్రౌండర్ అఫ్రిది భాగమయ్యాడు.
ఛారిటీ ఫౌండేషన్ తరఫున బ్యాట్ను అఫ్రిది కొన్నాడు అని ఐసీసీ ట్వీట్ చేసింది.కరోనా కష్ట సమయంలో పాకిస్తాన్ ప్రజలని ఆ దేశ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు.
అయినా కూడా అఫ్రిదీ తన చారిటీ ద్వారా సహాయక కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు.నిరుపేదలకి నిత్యావసర సరులుకులు ఇస్తున్నారు.
ఇక అఫ్రిదీకి కరోనా అని తేలడంతో అతని కుటుంబ సభ్యులకి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.అతనిని ట్రీట్మెంట్ కి తరలించారు.