కరోనా మహమ్మారి దశలవారీగా విజృంభిస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలలో విస్తృతంగా వ్యాప్తి చెంది ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఇలా కరోన వ్యాప్తి చెందడంతో ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరిగింది.
ముఖ్యంగా భారత దేశంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో ప్రాణ నష్టాన్ని కలిగించింది.ముఖ్యంగా ఈ కరోనా బారిన పడి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గిందని భావిస్తున్నప్పటికీ మరోసారి క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదని తెలుస్తోంది.
గత రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ ఆర్యన్ కార్తీక్ కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు.ఇకపోతే తాజాగా మరో బాలీవుడ్ సెలబ్రిటీస్ షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక కత్రినాకైఫ్ ఇటీవల విక్కీ కౌశల్ నుపెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడినప్పటికీ ఈమె పలు సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.ఈ క్రమంలోనే ఈమె కరోనా బారిన పడ్డారని తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.ఇక షారుఖాన్ విషయానికి వస్తే తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈయన జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.