మోటివేషనల్ స్పీకర్ షఫీ తెలంగాణలో కొత్తపార్టీ పెట్టబోతున్న షర్మిల తో భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.
షర్మిల ఆహ్వానం మేరకు ఆమెతో సమావేశమైనట్టు స్పష్టం చేశారు.అంతేకాకుండా ఇద్దరం కలిసి అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
రాజన్న రాజ్యం తీసుకోవటం కోసం తెలంగాణలో మార్పు తేవటం కోసం షర్మిల పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.ఇక ఇదే తరుణంలో ఆమె లో నాయకత్వ లక్షణాలు విషయంలో వైయస్ కనిపించినట్లు షఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నట్లు పేర్కొన్నారు.ఖచ్చితంగా మంచి రోజులు భవిష్యత్తులో రానున్నాయని తెలిపారు.
ఇదే తరుణంలో పార్టీలో చేరిక విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.ఏ బాధ్యతలు తీసుకోవాలి అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని త్వరలోనే అన్ని చర్చించి అనంతరం తెలియజేస్తాం ప్రజలలో మార్పు రావాలి అందరి జీవితాల్లో మార్పు వస్తుంది అన్న నమ్మకం ఉంది అన్నట్టు షఫీ వ్యాఖ్యానించారు.