చాలామంది బుల్లితెర నటులు వెండితెరపై పరిచయం అవుతుంటే.మరికొందరు వెండితెర నటులు బుల్లితెరపై కొన్ని సీరియల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బుల్లి తెర నుండి వెండితెరకు వస్తున్న నటులలో తక్కువ మంది ఉన్నప్పటికీ.వెండితెర నుండి బుల్లితెరకు వెళ్తున్న నటులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు.
ఇదిలా ఉంటే చక్రవాకం సీరియల్ తర్వాత అదే తరహాలో వచ్చిన మరో సీరియల్ మొగలిరేకులు.ఈ సీరియల్ కు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.ఇక ఈ సీరియల్ లో ఆర్ కె నాయుడు పాత్రలో నటించిన సాగర్.తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
ఇక సాగర్ సీరియల్ కు గుడ్ బై చెప్పి సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు.
సిద్ధార్థ అనే సినిమాలో సాగర్ హీరోగా నటించగా ఈ సినిమా అంత గుర్తింపు అందించలేకపోయింది.
ఇక మరో సినిమా రొమాంటిక్ కామెడీతో తెరకెక్కనున్న ‘షాదీముబారక్’ లో నటించాడు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కానున్న సందర్భంగా కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు సాగర్.
ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గారి బ్యానర్లో విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటూ తాను ఈ స్థాయికి రావడానికి కుటుంబ ప్రేక్షకులు అభిమానమేనని తెలిపాడు.ఇందులో పూర్తిగా వైవిధ్యం ఉన్న పాత్రలో చేశానంటూ మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకం ఉందంటూ ఇదివరకు ఫ్లాప్ అయిన సినిమాలా కాకుండా మంచి కథతో రావాలనే ఉద్దేశ్యంతో ఆలస్యంగా చేశానని తెలిపాడు.
ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుపుతూ.ఇకపై సీరియల్స్ లో నటించనంటూ.కేవలం సినిమాల పైనే దృష్టి పెడతాను అని తెలిపాడు.ఒకప్పుడు సీరియల్స్ లో నటించినందుకు ప్రేక్షకుల నుండి ఇప్పటికీ మంచి అభిమానం ఉందని చెప్పుకొచ్చాడు.
సీరియల్స్ లో ఒక రేంజ్ పాత్రలే చేశానంటూ అలాగే చేసుకుంటూ పోతే తర్వాత చేయడానికి అంత స్థాయిలో పాత్ర దొరక్కపోవచ్చని అంటున్నాడు.ప్రస్తుతం సీరియల్స్ లో నటించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు.