ఈ మధ్యకాలంలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి.ఒకప్పుడు ఎవరికైన ప్రమాదం జరిగింది అంటే అయ్యో.
పాపం.త్వరగా ఆరోగ్యవంతులు అవ్వాలి అని కోరుకునే వారు.
కానీ ఇప్పుడు వాళ్ళు చస్తే బాగుండు.వీళ్ళు చస్తే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అలాంటి ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ వారం రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి విదితమే.పుణె నుండి ముంబై హైవేపై వేగంగా వెళుతున్న ఆమె కారు ముందున్న ట్రక్కును ఢీ కొట్టడంతో నటి షాబానాకు, ఆమె డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అక్కడి స్థానికులు వారిని హుటాహుటిన నవీ ముంబైలోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.అనంతరం.
మెరుగైన చికిత్స కోసం కోకిలా బెన్ హాస్పిటల్కు తీసుకెళ్లారు.కొన్ని రోజుల పాటు షబానా ఐసీయూలో ఉన్నారు.
ఆ సమయంలో ఆమెను పరామర్శించేందుకు ఎందరో సినీ ప్రముఖులు ఆస్పత్రికి కూడా వెళ్లారు.ఒక్క ప్రముఖులే కాదు.
దేశ ప్రధాని సైతం ఆమె త్వరగా కొలొకోవాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అంతమంది ఆమె త్వరగా కోలుకోవాలని చూస్తుంటే ఉత్తర్ప్రదేశ్ లో ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ మాత్రం షబానాపై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ లో ఆ టీచర్ ఏం రాసింది అంటే.”షబానా చస్తే బాగుండు” అని ఆ పోస్టులో ఆమె రాసింది.దీంతో ఆ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ పోస్ట్ సంగతి అధికారులకు తెలియడంతో ఆమెను వెంటనే సస్పెండ్ చేశారు.
అయితే ఆమె షబానా చావు ఎందుకు కోరుకుంది? ఆమెకు షబానాకు ఏమైనా విబేధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.మరి ఆ పోస్ట్ పెట్టడానికి అసలు కారణం ఏంటో ఇంతవరుకు తెలియలేదు.