గుజరాత్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.వడోదరలోని దర్జిపురా వద్ద ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం చెందారు.మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.