హత్య కేసులో ప్రభుత్వం వన్ ఫస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సంజన తల్లి నిషా డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస గృహ సముదాయంలో హోం మంత్రి మహమూద్ అలీ ని భార్య సంజన, సంజన తల్లి నిషా, తాత జగదీష్ లతోపాటు రాజస్థానీ సొనిక్ క్షత్రియ (మాలి) ప్రతినిధులు రామ్ పాల్, శీతల, మేఘనాథ్, రాహుల్ లు వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ హత్య వెనుక ఉన్న నిజమైన హిందుత్వం సైతం చట్ట ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.నీరజ్ హత్యతో సంజన ఆమె కుమారుడి పోషణ భారంగా మారిందని అన్నారు.
ఈ నేపథ్యంలో సంజనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.తాము చేసిన విన్నపానికి హోం మంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించి, న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.