ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా జరిగాయో అదే రీతిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు మంచి స్పీడులో చేపడుతూ ఉంది.
ఇలాంటి తరుణంలో ముందుగా.కరోనా ఎంటరైన టైంలో ముందుండి పోరాడిన ఫ్రంట్ లైన్ ఆశావర్కర్ల కి ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయడం జరిగింది.ఈ తరుణంలో గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆశ వర్కర్ విజయలక్ష్మి నాలుగు రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా ఆమె తాజాగా అపస్మారకస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆశ వర్కర్ గా పని చేస్తున్న ఈమె యాక్షన్ తీసుకున్న తర్వాత చలిజ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి మొత్తం వైద్యులకు తెలిపి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ తల్లికి ఈ విధంగా అనారోగ్యం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.