అక్టోబర్ 10వ తారీఖు “మా” అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం చివరి పర్వానికి చేరుకోవడంతో.విమర్శల విషయంలో ఎవరూ తగ్గటం లేదు.
ప్రకాష్ రాజ్ అదే రీతిలో విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటా పోటీ వాతావరణం ఏర్పడింది.ఇటువంటి తరుణంలో ప్రకాష్ రాజ్.
మంచు ఫ్యామిలీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే.
కరోనా లాంటి కష్టకాలంలో చిరంజీవి ఎంతో సేవ చేశారని.ఆ సమయంలో మంచు కుటుంబం ఏం చేసిందని.
నిలదీశారు. క్రమశిక్షణ కుటుంబానికి ఉంటుందని చెబుతుంటారు మేమందరం రోడ్డుపై పుట్టామా.? మాకు లేదా క్రమశిక్షణ.? అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు.సినిమా పరిశ్రమకు ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి యే.పెద్ద దిక్కు అని పేర్కొన్నారు.ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి ఆస్తులు లాంటివారని పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పెద్ద నిధి అని కొనియాడారు.“మా” అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పాత గొడవలు తెరపైకి తీసుకొచ్చే లబ్ధి పొందాలని చూస్తున్నారు.మా అధ్యక్ష ఎన్నికల్లో ఈ నెల పదవ తారీకు నాడు గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫోన్ మంచు విష్ణు చేస్తానని.మా భవన నిర్మాణానికి.విష్ణు సాయం కూడా తీసుకుంటా అంటూ.ప్రకాష్ రాజ్ ధ్వజ మెత్తారు.
.