టిఆర్ఎస్ వంతు అయిపోయింది… కాంగ్రెస్ వంతు సాగుతోంది… ఇక మేము ఎందుకు ఊరుకోవాలి అనుకున్నారో ఏమో గానీ, తెలంగాణ తెలుగు తమ్ముళ్లు టికెట్ల కోసం రోడ్లపై కుస్తీలు పడుతున్నారు.చెప్పులు విసురుకుంటూ తమ వీర ప్రతాపం ప్రదర్శిస్తున్నారు.
అంతే కాదు అధిష్టానం మాకు సీటు ఇస్తుందంటే మాకు సీటు ఇస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ… విడివిడిగా ప్రచారం మొదలుపెట్టారు.ఆయా స్థానాలపై టిక్కెట్ ఆశిస్తున్న నేతలంతా ఇలా గ్రూపులు కట్టి మరి తన్నుకోవడం తెలంగాణ టీడీపీలో కలకలం రేపుతోంది.
ఇప్పటి వరకు ఈ విషయంలో టీఆర్ఎస్ ను అపహాస్యం చేసిన కాంగ్రెస్ టీడీపీలు తమ వంతు వచ్చేసరికి మౌనంగా తల పట్టుకున్నాయి.ఈ గ్రూపు తగాదాలతో తమ పార్టీకి వస్తుందని ఆందోళనతో ఉంది.
అంతేకాదు ఒకచోట మొదలైన ఈ పరిణామాలు అన్నిచోట్లకు విస్తరించి ఎక్కడ ఉంచుతుందని టిడిపి ఆందోళన వ్యక్తం చేస్తోంది.అసలు ఇప్పుడు వరకు మహాకూటమిలో సీట్ల లెక్క కేటాయింపులు అధికారికంగా విడుదల కాలేదు.రేపో మాపో కన్ఫామ్ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తన్నులాటలు చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యంగా… గ్రేటర్ హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటు కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్లపై బాహా బాహికి దిగారు.వీరి ఆందోళనకు ట్రాఫిక్ సైతం నిలిచిపోయి జనం చీదరించుకునే పరిస్థితి వచ్చేసింది.పోలీసులు వచ్చి బతిమాలి రెండు గ్రూప్ లకు సర్దిచెప్పి పంపడంతో ప్రస్తుతం శాంతించినా పరిస్థితి మాత్రం టీడీపీకి ఆందోళన కలిగిస్తోంది.
మహాకూటమి లో పొత్తులో భాగంగా… శేరి లింగంపల్లి స్థానం తమకే కేటాయిస్తారని టిడిపి తమ్ముళ్ళు ఆశతో వున్నారు.ఈ స్థానం లో టికెట్తమకే వస్తుందని … మొవ్వా సత్యనారాయణ, ఆనంద్ ప్రసాద్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నారు.ర్యాలీలుగా బయల్దేరి జనంలో తిరగడం మొదలు పెట్టేసారు.రెండు గ్రూప్ లు ఉండటంతో ఇరువురు ఒకేచోట ఎదురు కావడంతో ఇద్దరి నడుమ యుద్ధం మొదలైంది.వీరి వ్యవహారంలో అధిష్టానం జోక్యం చేసుకుని ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టకపోతే … ఈ సమస్య మరింత ముదురుతోంది… ఈ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాలపైనా పడుతుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.ఇక ఈ సీటు విషయంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు.
దీంతో ఈ నియోజకవర్గం సీటు ఏ పార్టీకి దక్కుతుందో అన్న సస్పెన్స్ ప్రస్తుతానికి కొనసాగుతోంది.