తెలుగు బుల్లి తెర సెలబ్రెటీల్లో కరోనా పెరిగి పోతుంది.షూటింగ్స్ మొదలయినప్పటి నుండి కూడా పలువురికి కరోనా ఎటాక్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
మొదట నటుడు ప్రభాకర్కు వైరస్ సోకింది.ఆ తర్వాత గృహలక్ష్మి నటుడికి వైరస్ సోకింది.
ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి కి కరోనా పాజిటివ్ అంటూ తేలడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.బుల్లి తెర వర్గాలకు ఇది మరో ఆందోళనకర విషయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నాడు.
తెలుగు బుల్లి తెరపై నా పేరు మీనాక్షి మరియు ఆమె కథ సీరియల్స్తో ఆకట్టుకున్న
నవ్య
ప్రస్తుతం ఫుల్ బిజీగా షూటింగ్లో పాల్గొంటుంది.ఈ సమయంలో అనూహ్యంగా ఆమెకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆమెతో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం సీరియల్ సెలబ్రెటీలు అయిన పలువురికి పాజిటివ్ వచ్చినా కూడా బయటకు చెప్పడం లేదు.
బుల్లి తెర ఇండస్ట్రీలో చాలా మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యి ఉంటుందని కాని ఎవరు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా ప్రముఖులకు పాజిటివ్ రిపోర్ట్ వస్తే అప్పుడు కాస్త హడావుడి చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి హైదరాబాద్ పరిధిలో షూటింగ్స్ జరిపితే మరింతగా కేసులు పెరిగే అవకాశం ఉంది.