ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా సీరియల్స్ లో కూడా అందాల భామల జోరు కొనసాగుతుంది.టాలెంట్ ఉంది గ్లామర్ షోకి సిద్ధంగా లేకపోవడం వలన సినిమాలలో అవకాశాలు రాని అందాల భామలు అందరూ సీరియల్స్ వైపు అడుగులు వేస్తున్నారు.
సీరియల్స్ స్టాండర్డ్స్ కూడా పెరగడంతో వారికి రెమ్యునరేషన్ కూడా బాగా అందుతుంది.ఇదే సమయంలో ఒకే సారి రెండు, మూడు సీరియల్స్ చేసుకునే అవకాశం ఉండటం, ఆపై నిలకడగా ఆదాయం ఉండటంతో చాలా మంది భామలు సినిమాలలో హీరోయిన్ అయిపోవాలనే ఆశలు వదులుకొని సీరియల్స్ లోకి అడుగుపెడుతున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగు సీరియల్స్ లో కూడా గ్లామర్ ఎక్కువగా కనిపిస్తుంది.అలాగే సినిమాటిక్ సన్నివేశాలు కూడా సీరియల్స్ లో దర్శనం ఇస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలుగు సీరియల్స్ లో మంచి టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నవ్యస్వామి.ఈ భామ ఆహ్వానం, నాపేరు మీనాక్షి, ఆమెకథ సీరియల్స్ లో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకి చేరువ అయ్యింది.
నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ మంచి హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది.తెలుగు సీరియల్స్ తోపాటు తమిళ్ లో కూడా చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు రీసెంట్ గా కరోనా బారిన పడి మళ్ళీ కోలుకుంది.ఇప్పుడు ఈమెకి అరుదైన గుర్తింపు వచ్చింది.
కన్నడ బ్యూటీ 2020 ఏడాదికి గాను బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైంది.ఈ అవార్డును ఇటీవల తీసుకున్న నవ్య ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా నవ్య తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అవార్డు తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందని, మీ అందరి ప్రేమ, మద్దతు లేకుండా ఈ అవార్డు వచ్చేది కాదు.
అందరికీ చాలా థ్యాంక్స్.థ్యాంక్స్ అని చెబితే నిజంగా సరిపోదు అని నవ్య కామెంట్ పెట్టారు.