బుల్లితెర నటీనటులు అయినటువంటి ధనుష్ -కీర్తి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.గత కొద్ది రోజుల క్రితం కీర్తి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
తాజాగా నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు నటుడు ధనుష్ ఈ విషయాన్ని స్వయంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ దంపతులు తమ బిడ్డకు “రుద్వేద్” అనే పేరును కూడా పెట్టినట్టు తెలుస్తోంది.
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈ జంట నిజ జీవితంలో ఒక్కటయ్యారు.ఈ క్రమంలోనే మొట్ట మొదటిసారిగా తల్లిదండ్రులు అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేయడంతో పలువురు నటీనటులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే బుల్లితెరపై డాక్టర్ బాబు గా ఎంతో ఫేమస్ అయినటువంటి పరిటాల నిరుపమ్ -పరిటాల మంజుల స్వయానా కీర్తికి అక్క బావ అన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా కీర్తి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో రెండు కుటుంబాలలో ఆనందం నెలకొంది.అదేవిధంగా నటుడు ధనుష్ కీర్తి కలిసి తన బిడ్డతో ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోనే బిడ్డ మొహం కనపడకుండా కవర్ చేసినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.