ప్రస్తుత కాలంలో కొందరు నటీమణులు ఎన్నోకలలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.అయితే ఇందులో కొందరు కష్టపడి పనిచేస్తే మరికొందరు మాత్రం అవకాశాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
అయితే తాజాగా కవితా లక్ష్మి అనే మహిళ కూడా కొన్నేళ్ల క్రితం తన టాలెంట్ ని నిరూపించుకుని మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సినీ పరిశ్రమకి వచ్చింది.అయితే ఇందుకు తగ్గట్టుగానే బాగానే కష్టపడుతూ పలురకాల సీరియళ్లలో నటించే అవకాశాలు దక్కించుకుంది.
దీంతో 13 ఏళ్ల క్రితం సినీ పరిశ్రమకు చెందిన సినీ పరిశ్రమకి చేందినటువంటి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఒకపక్క చేతిలో నిండుగా అవకాశాలు, మరో పక్క భర్త పిల్లలతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో తన భర్తతో వివాదాలు మొదలయ్యాయి.
దీంతో ఈ మధ్యకాలంలో తన భర్త నుంచి విడిపోయి తన పిల్లల సంరక్షణ కూడా తానే చూసుకుంటోంది.అయితే ఇందులో భాగంగా తన ముగ్గురు పిల్లల చదువుల నిమిత్తమై బాగానే డబ్బు ఖర్చు అవుతుండడంతో పగటి పూట షూటింగులకు హాజరవుతూ రాత్రి సమయంలో హైవే పక్కన హోటల్ నిర్వహిస్తూ దోశలను అమ్ముకుంటోంది.
అయితే తాజాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అవుతోంది.దీంతో పలువురు సినీ అభిమానులు కవితా లక్ష్మికి అండగా నిలుస్తున్నారు.డబ్బు కోసం అడ్డదారులు తొక్కకుండా కష్టపడి పని చేస్తున్నటువంటి కవితా లక్ష్మిని పలువురు అభినందిస్తున్నారు.అంతేగాక ఆమె పరిస్థితి తెలుసుకున్నటువంటి పలు సీరియల్ దర్శక నిర్మాతలు కూడా అండగా నిలుస్తున్నారు.