శర్వానంద్ ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడని మనందరికీ తెలుసు.ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమామహాసముద్రం’లో నటిస్తున్నాడు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమాను ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.ఇందులో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల చేయబోతున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు.
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికేట్ జారీ చేసారు.
ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమా మరొక వారం రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది.అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 9న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరగనుంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.